పంజాబ్ ను ‘‘సెట్’’ చేస్తున్న కాంగ్రెస్.. కీలక నేతను రంగంలోకి…
వచ్చే యేడాది పంజాబ్ ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం అక్కడ ఆప్ అధికారంలో వుంది. వచ్చేసారి అధికారం కోసం కాంగ్రెస్, బీజేపీ రెండూ తెగ ప్రయత్నాలు చేస్తోంది. అయితే.. కొన్ని రోజులుగా పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు తార స్థాయికి చేరుకుంది. మాజీ సీఎం చెన్నీ వర్సెస్ కాంగ్రెస్ గా మారిపోయింది. ఈ నేపథ్యంలో ఎన్నికల ముందు కాంగ్రెస్ అధిష్ఠానానికి పెద్ద తలనొప్పిగా మారింది.
ఈ నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్ఠానం అత్యంత కీలక నిర్ణయం తీసుకుంది. పార్టీ వ్యవహారాల ఇన్ చార్జీగా వున్న భూపేష్ సింగ్ బాఘేల్ ను ఆ బాధ్యతల నుంచి తప్పించింది. ఆయన స్థానంలో సచిన్ పైలట్ ను నియమించింది.
2027 నాటికి పార్టీ వ్యవస్థను బలోపేతం చేసే బాధ్యతతో, గత ఏడాది మార్చిలో బఘేల్ కాంగ్రెస్ పంజాబ్ వ్యవహారాల ఇన్ఛార్జ్గా నియమితులయ్యారు. గ్రూపు తగాదాలను తగ్గిస్తారన్న విశ్వాసంతో అధిష్ఠానం ఈ బాధ్యతలను అప్పగించింది. గ్రూపిజాన్ని తగ్గించడంలో బాఘేల్ విఫలమయ్యారని అధిష్ఠానం గట్టిగా భావించింది. పంజాబ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వారింగ్ను కొనసాగిస్తూనే, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్గా చన్నీని నియమించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినప్పుడు జూలై 1న తాజా వివాదం తలెత్తింది.అంతేకాకుండా బాఘేల్ పై పంజాబ్ కాంగ్రెస్ కూడా తీవ్ర అసంతృప్తితో వుంది. ‘‘బాఘేల్ గో బ్యాక్ అంటూ నినాదాలు కూడా ఇచ్చారు. దీంతో అధిష్ఠానం ఖంగుతింది. రెండు వర్గాల మధ్య ఉన్న వైరాన్ని పరిష్కరించడంలో సంస్థాగత నాయకత్వం విఫలమైందనే అభిప్రాయం పంజాబ్ కాంగ్రెస్లోని కొన్ని వర్గాలలో బలపడుతున్న నేపథ్యంలో బఘేల్ నిష్క్రమణ జరిగింది.
సచిన్ పైలట్ ముందున్న సవాళ్లలివే..
చిన్ పైలట్ ఇప్పుడు బాధ్యతలు చేపట్టడంతో, 2027 అసెంబ్లీ ఎన్నికలకు ముందు తలెత్తిన వర్గపోరు వల్ల 2024 నాటి తమ ఊపు దెబ్బతినకుండా చూసుకోవాల్సిన సవాలు కాంగ్రెస్ ముందు ఉంది. రాష్ట్ర స్థాయి పార్టీ యంత్రాంగాన్ని పునర్వ్యవస్థీకరించడానికి మరియు పరస్పర విరోధ వర్గాలను దగ్గర చేయడానికి పార్టీ అధిష్ఠానం చేసిన ప్రయత్నంగానే ఆయన నియామకాన్ని భావిస్తున్నారు.బఘేల్ విఫలమైన చోట పైలట్ విజయం సాధించగలరా అలాగే చన్నీ మరియు వారింగ్ వర్గాలను కలిసి పనిచేసేలా ఒప్పించగలరా అన్నది 2027లో పంజాబ్లో కాంగ్రెస్ భవిష్యత్తుకు కీలకం కానుంది.








