బెంగాల్ లో ముగిసిన ఎన్నికల ప్రచారం.. సర్వ శక్తులూ ఒడ్డిన పార్టీలు
అత్యంత ప్రాముఖ్యత సంతరించుకున్న బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సోమవారంతో ముగిసింది. కొన్ని రోజులుగా టీఎంసీ, బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు హోరాహోరీగా ప్రచారాన్ని నిర్వహించాయి. ఓటర్లను తమ వైపు తిప్పుకోవడానికి అన్ని ప్రయత్నాలు చేశాయి అన్ని పార్టీలూ. ముఖ్యంగా అధికార తృణమూల్ కాంగ్రెస్ నుంచి మమతా బెనర్జీ, బీజేపీ నుంచి ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా సర్వ శక్తులూ ఒడ్డారు.
ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, టీఎంసీ నుంచి మమతా బెనర్జీ విస్తృతంగా రోడ్ షోలు, ర్యాలీలు, బహిరంగ సభలు నిర్వహించారు. ప్రధాని మోదీ ఉత్తర 26 పరగణాల జిల్లాలో ర్యాలీ నిర్వహించగా, అమిత్ షా షుగ్లీ జిల్లాలో రోడ్ షోలో పాల్గొన్నారు.ఇక.. ముఖ్యంగా యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ కూడా ఈ సారి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.ఇక తృణమూల్ నుంచి మమతా బెనర్జీ కలకత్తాలో రోడ్ షో నిర్వహించారు. దీంతో ఎన్నికల ప్రచారం ముగిసింది.
బుధవారం జరగనున్న రెండో దశ పోలింగ్కు 48 గంటల కంటే తక్కువ సమయం మిగిలి ఉండగా, సాయంత్రం 6 గంటల ప్రచార గడువు ముగిసేలోపు, అగ్ర నాయకుల ప్రచార కార్యక్రమాలు ప్రజలను చేరుకునేందుకు చివరి ప్రయత్నం చేశాయి.
దక్షిణ కోల్కతాలో భారీ రోడ్షోతో మమతా బెనర్జీ తన ప్రచారాన్ని ముగించారు. నాలుగోసారి అధికారంలోకి వస్తాననే ఆత్మవిశ్వాసంతో ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు టిఎంసి అధినేత్రిని చూసేందుకు వీధుల వెంబడి వేలాది మంది ప్రజలు బారులు తీరారు. మమతతో పాటు ఆమె పార్టీ నాయకులు ఎంపీ సాగరికా ఘోష్, టోలీగంజ్ అభ్యర్థి ఆరూప్ బిస్వాస్, రాష్బిహారి అభ్యర్థి దేబాశిష్ కుమార్ పక్కనే నడిచారు.
ఇవి కూడా చదవండి
మమత హెల్మెట్ ధరించి మోటార్సైకిల్ వెనుక కూర్చుని ప్రయాణించడం కూడా కనిపించింది. ఇది ప్రచార చివరి రోజులో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్, రాష్ట్రీయ జనతా దళ్ నాయకుడు తేజస్వి యాదవ్, జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాష్ట్రంలోని అధికార పార్టీకి తమ మద్దతును ప్రకటించడంతో, తాను ఒంటరిని కానని, బీజేపీ బలాన్ని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాల మద్దతు తనకు ఉందని మమత ఒక సందేశాన్ని పంపే ప్రయత్నం చేశారు.
మరోవైపు, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉత్తర 24 పరగణాల జిల్లాలోని బారక్పూర్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండో దశ పోలింగ్ జరగనున్న 142 నియోజకవర్గాలలో ఇది ఒకటి. వచ్చే వారం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి తాను మళ్లీ రాష్ట్రానికి వస్తానని ప్రధాని పూర్తి ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు. ఎన్నికల ఫలితాలు మే 4న వెలువడనున్నాయి.
“ఈసారి బెంగాల్ పర్యటన నాలో ఒక విలక్షణమైన, ప్రత్యేకమైన అనుభూతిని కలిగిస్తోంది. మండుతున్న ఎండ తీవ్రత ఉన్నప్పటికీ, నాకు ఏమాత్రం అలసట అనిపించడం లేదు. బెంగాల్ ఎన్నికల ప్రచారంలో ఇదే నా చివరి బహిరంగ సభ. మే 4 తర్వాత జరిగే ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున నేను మళ్లీ ఇక్కడికి వస్తాననే దృఢ విశ్వాసంతో నేను బెంగాల్ నుండి తిరిగి వెళ్తున్నాను,” అని ప్రధాని మోదీ తెలిపారు.
ఇక.. నేతలు తమ పనిని ముగించారు. ఇప్పుడు మిగిలిందంతా ప్రజలదే. అన్ని పార్టీలూ తమ తమ మేనిఫెస్టోలను, వాగ్దానాలను ప్రజల ముందు వుంచాయి. అలాగే ప్రధాన పార్టీలు,వారి అగ్రనేతలు అందరూ గట్టిగానే ప్రచారం చేశారు. అలాగే బూత్ స్థాయిలో కూడా ఆయా పార్టీల నేతలు తమ ప్రచారం చేశారు. ఓటర్లకు తామేం చేస్తామో వివరంగా వివరించారు.
అన్నీ విన్న ఓటర్లు… ఇప్పుడు ఎవరి వైపు మొగ్గు చూపుతారన్నది తేలాల్సి వుంది. అన్నీ విన్న ప్రజలు ఎవరి వైపు మొగ్గు చూపుతారు? ఎవరికి అధికారాన్ని కట్టబెడతారన్నది వేచి చూడాల్సిందే.
ఇవి కూడా చదవండి







