బీజేపీ అమాంతం మింగేయకుండా ఎన్సీపీని పీకే కాపాడుతున్నారా?
మహారాష్ట్రలో రాజకీయం మరో కొత్త మలుపు తిరిగింది. బకింపూర్ ఎమ్మెల్యే, వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్, ఎన్సీపీ అధినేత్రి, డిప్యూటీ సీఎం సునేత్ర పవార్ తో భేటీ అయ్యారు. దాదాపు 6 గంటల పాటు సుదీర్ఘంగా ఈ భేటీ సాగినట్లు తెలుస్తోంది. ఇందులో సునేత్ర పవార్ కుమారుడు పార్థూ కూడా పాల్గొన్నారు. అయితే.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీయేనని ఎన్సీపీ చాలా తేలిగ్గా చెబుతోంది.
కానీ.. ఇది కేవలం మర్యాదపూర్వక భేటీ మాత్రమే కాదని మరి కొందరు అంటున్నారు. ప్రస్తుత పార్టీ పరిస్థితి, భవిష్యత్ తదితర అంశాలను వీరు చర్చించుకున్నట్లు అంటున్నారు. అయితే దీనిప ైమంత్రి చంద్రశేఖర్ బావంకులే స్పందిస్తూ.. ఎన్సీపీ అంతర్గత వ్యవహారం అని తెలిపారు. మహాయువతి కూటమిలో భాగస్వామిగావున్న సమయంలో కూటమిలో అనుమానాలు లేదా అపనమ్మకం ఏర్పడేలా ఎలాంటి చర్యలకు తావు ఇవ్వొద్దని సూచించారు.
మరో వైపు సునేత్ర పవార్ ,పార్థూ పవార్ తప్పించి, ఇతర ఎన్సీపీ నేతలు ఎవ్వరు కూడా ఈ భేటీలో పాల్గొనలేదు. దీంతో తప్పకుండా వీరి మధ్య భవిష్యత్ కార్యాచరణ, పార్టీ నిర్మాణం చర్చకు వచ్చిందని టాక్.తన భర్త, సీనియర్ నేత అజిత్ పవార్ మరణం తర్వాత ఎన్సీపీపై పట్టు సాధించడానికి ప్రయత్నిస్తున్న సునేత్ర, మిత్రపక్షమైన బీజేపీ ఎత్తుగడల వల్ల బలహీనపడే అవకాశం ఉన్నందున, ఆమెకు ఒక చురుకైన రాజకీయ వ్యూహకర్త తోడు అవసరం. రాజకీయ వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్న కిషోర్ అటువంటి తోడ్పాటును అందించగలరు.
ఎన్సీపీ (NCP) పార్టీ వ్యవస్థను పునర్నిర్మించడంలోనూ, ఎన్నికల వ్యూహాన్ని కొత్తగా రూపొందించడంలోనూ కిషోర్ అందించే సలహాలు ఎంతో విలువైనవిగా ఉంటాయి. పవార్ కుటుంబంతో ఎప్పుడూ మంచి సంబంధాలు కలిగి ఉన్న ఆ జేఎస్పీ (JSP) నేతను స్వయంగా పార్థే సంప్రదించినట్లు భావిస్తున్నారు.
ఈ సందర్భంగానే పీకే ఎన్సీపీ అధినేత్రి సునేత్రకు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. రాష్ట్ర ఎన్సీపీ నాయకత్వం మొత్తాన్ని కూడా ప్రక్షాళన చేయాలని సూచించారు. అంతేకాకుండా ప్రజలు ఎన్నుకున్న ప్రజా ప్రతినిధికే పార్టీ పగ్గాలు అప్పజెప్పాలని కూడా సూచించారు. అలాగే జాతీయ స్థాయి నేతల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షించాలని కూడా సునేత్రకు సూచించారు.
సునేత్ర మరియు పార్త్లను సందిగ్ధంలో ఉంచేందుకు, కూటమిలోని ప్రధాన భాగస్వామ్య పక్షం శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ (SP)తో మంతనాలు జరుపుతుండటంతో బీజేపీతో ఎన్సీపీ సంబంధాలు ఒత్తిడికి గురవుతున్నాయి. రాబోయే జిల్లా పరిషత్ మరియు పంచాయతీ ఎన్నికల్లో అధికార ‘మహాయుతి’ కూటమిలో భాగంగా కాకుండా, ఎన్సీపీ ఒంటరిగా పోటీ చేసే అవకాశం ఉంది. అయితే కాంగ్రెస్ ఇటీవల సునేత్రను ‘‘మాటలు రాని బొమ్మ’’ అంటూ దొప్పిపొడించింది. అయినా సునేత్ర వైపు నుంచి ఎలాంటి విమర్శలు చేయలేదు. ఇలా విమర్శలు చేయవద్దని, సరైన వ్యూహంలోనే వున్నారని పీకే వారితో అన్నట్లు నేతలు చెబుతున్నారు.








