Saudi Arabia: చమురు క్షేత్రాలపై దాడుల ఎఫెక్ట్.. 180 డాలర్లకు చేరనున్న బ్యారెల్ ధర: సౌదీ!
Saudi Arabia: పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ మేఘాలు ప్రపంచ ఇంధన రంగాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. హర్మూజ్ జలసంధిలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు , ఇంధన క్షేత్రాలే లక్ష్యంగా జరుగుతున్న దాడులు చమురు ధరలను రికార్డు స్థాయికి చేర్చేలా కనిపిస్తున్నాయి. ఒకవేళ ఏప్రిల్ చివరి వరకు హర్మూజ్ జలసంధిలో రాకపోకలు పునరుద్ధరించకపోతే, ముడిచమురు ధర బ్యారెల్కు 180 డాలర్లకు చేరవచ్చని సౌదీ అరేబియా అంచనా వేస్తోంది.
చమురు ధరల పెరుగుదల: ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభం కావడానికి ముందు 70 డాలర్లుగా ఉన్న బ్రెంట్ క్రూడ్ ధర, ప్రస్తుతం 119 డాలర్లకు చేరుకుంది. ఎర్ర సముద్రంలోని టెర్మినళ్లపై దాడులు పెరిగితే, ధరలు 150 డాలర్ల మార్కును సులభంగా దాటుతాయని నిపుణుడు ఉమర్ కరీం హెచ్చరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
ఎర్ర సముద్రంపై దాడులు: హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా సౌదీ అరేబియా ఎర్ర సముద్రం మీదుగా ఎగుమతులు పెంచినప్పటికీ, అక్కడ కూడా ముప్పు పొంచి ఉంది. ఇటీవలే యాన్బు పోర్టు సమీపంలోని అరామ్కో రిఫైనరీపై డ్రోన్ దాడి జరగడం ఆందోళన కలిగిస్తోంది.
గ్యాస్ సంక్షోభం: ఖతార్లోని ప్రపంచంలోనే అతిపెద్ద గ్యాస్ క్షేత్రమైన రస్ లఫాన్ పై ఇరాన్ జరిపిన దాడి అంతర్జాతీయ గ్యాస్ సరఫరాను దెబ్బతీసింది. దీని మరమ్మతులకు నెలల సమయం పట్టవచ్చని గ్లోబల్ ఎనర్జీ పాలసీ పరిశోధకురాలు అన్నె సోఫీ అభిప్రాయపడ్డారు. ఇది ప్రపంచవ్యాప్తంగా ఎల్ఎన్జీ (LNG) ధరలు విపరీతంగా పెరగడానికి దారితీసే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి








