క్రిస్మస్ బరిలో ఇద్దరు సీనియర్లు.. బాలయ్య vs నాగ్ పోరు ఆసక్తికరం!
ఈ ఏడాది క్రిస్మస్ సీజన్ టాలీవుడ్లో ఆసక్తికరమైన బాక్సాఫీస్ పోరుకు వేదికగా మారనుంది. సీనియర్ హీరోలు నందమూరి బాలకృష్ణ(nandamuri balakrishna), అక్కినేని నాగార్జున(akkineni nagarjuna) తమ తాజా సినిమాలతో ఒకే రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. డిసెంబర్ 24న ఈ రెండు సినిమాలు రిలీజ్ కానున్నట్టు క్లారిటీ రావడంతో అభిమానుల్లోనూ, ట్రేడ్ వర్గాల్లోనూ ఆసక్తి పెరుగుతోంది. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు కీలకంగా భావించే హాలిడే సీజన్లో ఇద్దరు వెటరన్ హీరోలు పోటీ పడటం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
బాలకృష్ణ ప్రస్తుతం డైరెక్టర్ గోపీచంద్ మలినేని(Gopichand malineni) తెరకెక్కిస్తున్న NBK111పై దృష్టి పెట్టారు. షూటింగ్ టైమ్ లో హీరోకు గాయం కావడంతో కొంత గ్యాప్ ఏర్పడింది. సెప్టెంబర్లో షూటింగ్ తిరిగి ప్రారంభించి, పనులను వేగంగా పూర్తి చేసి క్రిస్మస్ కానుకగా సినిమాను రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో కాజల్(Kajal) హీరోయిన్ గా నటిస్తుండగా, వెంకట సతీష్ కిలారు(Venkata satish kilaru) నిర్మిస్తున్నారు.
మరోవైపు నాగార్జున(nagarjuna) తన కెరీర్లో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న 100వ సినిమా కింగ్100తో ఆడియన్స్ ముందుకు రానున్నారు. తాజాగా రిలీజైన గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచింది. హీరోయిజంతో పాటు కథకు ప్రాధాన్యత ఉన్న సినిమాగా ఇది కనిపిస్తోంది. కార్తీక్(Raw karthik) దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్(Annapurna studios) నిర్మిస్తోంది. ఒకే రోజున రెండు సినిమాలు రావడంతో థియేటర్లు, ఓపెనింగ్స్, ప్రేక్షకుల ఆదరణ విషయంలో బాలయ్య- నాగ్ పోటీ ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది.








