దావోస్ లో కేటీఆర్ను కలిసిన భారతీయ జూబ్లియంట్ చైర్మన్, ఎండీ
దావోస్ లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో భారతీయ జూబ్లియంట్ చైర్మన్ శ్యామ్ ఎస్ భారతియా, ఎండీ హరి ఎస్ భారతియా ఇవాళ మంత్రి కేటీఆర్ను కలిశారు. ఈ సమావేశంలో రాష్ట్రంలో లైఫ్ సైన్సెస్ ఎకోసిస్టమ్ గురించి మంత్రి వివరించారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు.






