‘అటా బిజినెస్ కమిటీ’ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాపార సదస్సులు
అమెరికాలో ప్రతిష్ఠాత్మక తెలుగు సంస్థ అమెరికా తెలుగు సంఘం (ఆటా) ఆధ్వర్యంలో జరగనున్న 19వ అటా కాన్ఫరెన్స్, యూత్ కన్వెన్షన్ వేడుకలు వ్యాపార రంగానికి పెద్దపీట వేస్తున్నాయి. 2026 జూలై 31 నుండి ఆగస్టు 2 వరకు మేరీల్యాండ్లోని బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగనున్న ఈ మహాసభల్లో భాగంగా ‘అటా బిజినెస్ కమిటీ’ ఆధ్వర్యంలో ప్రత్యేక వ్యాపార సదస్సులను నిర్వహించనున్నారు.
ముఖ్యాతిథులుగా ప్రముఖ బిజినెస్ లీడర్స్
ఈ సదస్సుకు అమెరికాలోని పలువురు అగ్రశ్రేణి మేధావులు, రాజకీయ నేతలు మరియు వ్యాపార దిగ్గజాలు కీనోట్ స్పీకర్లుగా హాజరుకానున్నారు:
అరుణా మిల్లర్ (మేరీల్యాండ్ లెఫ్టినెంట్ గవర్నర్)
పవన్ పిడుగు (సీఐఓ, యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ – యుఎస్ డిఓటి)
అనిల్ శర్మ (సీఈఓ, 22వ సెంచరీ టెక్నాలజీస్)
డాక్టర్ ఎం.ఎస్. రెడ్డి (చైర్మన్ అండ్ ప్రెసిడెంట్, ఐఎంఎసి – మోటివేషనల్ స్పీకర్)
బిజినెస్ ప్యానెల్స్ – చర్చాంశాలు
స్టార్టప్లు, పెట్టుబడులు మరియు వ్యాపార విస్తరణే ధ్యేయంగా ఈ క్రింది కీలక ప్యానెల్ చర్చలను ఏర్పాటు చేశారు:
ఎంఅండఎ (మెర్జర్స్ అండ్ అక్విజిషన్స్) ప్యానెల్:
వ్యాపారాల విలీనాలు మరియు కొనుగోళ్లపై రాణా చేగు, క్రెయిగ్ చేసన్, గౌతమ్ ఐజూర్, మేరీబెత్ వూటన్ మరియు బాబ్ కిప్స్ వంటి ప్రముఖులు తమ అనుభవాలను పంచుకోనున్నారు.
స్టార్టప్ ప్యానెల్:
కొత్త తరం పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు రామ్ సుదిరెడ్డి, రవి రెడ్డి, సందేష్ శారద, శ్రీ పెద్దు, దయాకర్ పూస్కూర్లతో కూడిన ప్యానెల్ దిశానిర్దేశం చేయనుంది. ఈ మొత్తం బిజినెస్ సెషన్స్కు అటా బిజినెస్ కమిటీ చైర్మన్, స్కై సొల్యూషన్స్ సీఈఓ అనిల్ బోయినపల్లి మోడరేటర్గా వ్యవహరించనున్నారు.
ప్రధాన కార్యక్రమాలు:
ప్రారంభ బిజినెస్ సెషన్స్
ఎం అండ్ ఎ వ్యూహాలపై చర్చలు
వీసీ (వెంచర్ క్యాపిటలిస్ట్) లంచ్ అండ్ క్యాపిటల్ రౌండ్ టేబుల్స్
రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఫోరమ్
బిజినెస్ నెట్వర్కింగ్ రిసెప్షన్
వ్యాపార రంగంలో రాణించాలనుకునే ప్రవాస తెలుగు పారిశ్రామికవేత్తలు, యువతీ యువకులు మరియు ఇన్వెస్టర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అటా ప్రెసిడెంట్ జయంత్ చల్లా, కన్వీనర్ శ్రీధర్ బనాలా, కోఆర్డినేటర్ రవి చల్లా మరియు బిజినెస్ కమిటీ సభ్యులు కోరారు.








