Davos: ఒకే వేదికపై ముగ్గురు ముఖ్యమంత్రులు…
దావోస్ (Davos)లో జరిగిన కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు(Chandrababu), తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (Revanth Reddy), మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis) పాల్గొన్నారు. దేశం ఒక యూనిట్గా పెట్టుబడులు రాబట్టేలా కేంద్ర వాణిజ్య మంత్రిత్వశాఖ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా 3 రాష్ట్రాల ముఖ్యమంత్రులు.. కంట్రీ స్ట్రాటజిక్ డైలాగ్ సమావేశంలో పాల్గొన్నారు. గ్రీన్ ఎనర్జీ, ఏఐ, రక్షణ రంగంలో పెట్టుబడులకు సంబంధించిన అంశాలు సమావేశంలో చర్చించారు. అలాగే ఉపాధి ఇతర అవకాశాలపై కూడా చర్చలు జరిగినట్లు తెలుస్తోంది.






