వ్యూహాత్మకంగా బీజేపీ నూతన టీమ్.. రాం మాధవ్, స్మృతి ఇరానీకి కీలక బాధ్యతలు
బీజేపీ నూతన జాతీయ కార్యవర్గాన్ని ప్రకటించింది. సోమవారం పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ నేతృత్వంలో ప్రకటించిన ఈ కొత్త జాబితాలో అనుభవజ్ఞులతోపాటు యువ నాయకులకు పెద్దపీట వేస్తూ, ప్రాంతీయ ప్రాతినిధ్యానికి ప్రాధాన్యత కల్పించారు.
బీజేపీ జాతీయ ఉపాధ్యక్షులుగా ఏపీ బీజేపీ మహిళా నేత, ఎంపీ పురందేశ్వరి, మాజీ ముఖ్యమంత్రి వసుంధరా రాజె, రామ్ మాధవ్ సహా 13 మంది పేర్లను ప్రకటించారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా స్మృతి ఇరానీకి అవకాశం కల్పించారు. పార్టీ జాయింట్ కోఆర్డినేటర్గా విష్ణువర్ధన్రెడ్డిని నియమించారు. కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జ్గా తరుణ్ చుగ్, ఓబీసీ మోర్చా నూతన అధ్యక్షుడిగా అమర్పాల్ మౌర్య పేర్లను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. అదేవిధంగా సంస్థాగత జనరల్ సెక్రటరీగా బీఎల్ సంతోష్, సంస్థాగత జాయింట్ జనరల్ సెక్రటరీగా శివప్రకాష్ పేర్లను ఖరారు చేసింది.
తిరిగి కీలక బాధ్యతల్లోకి రాం మాధవ్…
గతంలో బీజేపీలో కీలకంగా వ్యవహరించి, తిరిగి మాతృ సంస్థ ఆరెస్సెస్ లోకి వెళ్లిపోయిన రాం మాధవ్ కి తిరిగి కీలక బాధ్యత అప్పజెప్పారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షునిగా రాం మాధవ్ ను ప్రకటించారు. దీంతో ఆయన తిరిగి రాజకీయాల్లో క్రియాశీలకంగా మారనున్నారు. అయితే.. రాం మాధవ్ కి గతంలో జమ్మూ కాశ్మీర్, తెలుగు రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలను అప్పగించారు. ఈసారి ఏ బాధ్యతలు అప్పజెబుతారన్నది చూడాలి.
జాతీయ ఉపాధ్యక్షులు వీరే..
♦ వసుంధర రాజే సింధియా (రాజస్థాన్),
♦ తీరథ్ సింగ్ రావత్ (ఉత్తరాఖండ్)
♦ రామ్ మాధవ్ (ఢిల్లీ)
♦ బైజయంత్ జయ్ పాండా (ఒడిశా)
♦ దగ్గుబాటి పురంధేశ్వరి (ఆంధ్రప్రదేశ్)
♦ రేఖా వర్మ (ఉత్తరప్రదేశ్)
♦ వర్షాబెన్ నరేంద్రభాయ్ దోషి (గుజరాత్)
♦ డా. భారతి ప్రవీణ్ పవార్ (మహారాష్ట్ర)
♦ సర్దార్ మన్ప్రీత్ సింగ్ బాదల్ (పంజాబ్)
♦ లాల్ సింగ్ ఆర్య (మధ్యప్రదేశ్)
♦ ప్రొఫెసర్ ఎం. నాగరాజా (కర్ణాటక)
♦ ప్రొఫెసర్ తారిఖ్ మన్సూర్ (ఉత్తరప్రదేశ్)
♦ డా. మధుచంద్ర కార్ (పశ్చిమ బెంగాల్)
జాతీయ ప్రధాన కార్యదర్శి (సంస్థాగతం) :
♦ బి.ఎల్. సంతోష్ (ఢిల్లీ)
జాతీయ సంయుక్త ప్రధాన కార్యదర్శులు (సంస్థాగతం)
♦ శివప్రకాశ్ (ముంబై)
♦ సౌదాన్ సింగ్ (చండీగఢ్)
జాతీయ ప్రధాన కార్యదర్శులు :
♦ వినోద్ తావ్దే (మహారాష్ట్ర)
♦ సునీల్ బన్సల్ (ఢిల్లీ)
♦ బిప్లబ్ కుమార్ దేవ్ (త్రిపుర)
♦ స్మృతి ఇరానీ (ఉత్తరప్రదేశ్)
♦ డా. సతీష్ పూనియా (రాజస్థాన్)
♦ గజేంద్ర పటేల్ (మధ్యప్రదేశ్)
♦ హరీశ్ ద్వివేది (ఉత్తరప్రదేశ్)
♦ సంజయ్ భాటియా (హర్యానా)
జాతీయ కార్యదర్శులు: కవిత పాటీదార్, కె.సురేంద్రన్, డాక్టర్ భోలాసింగ్, డాక్టర్ ప్రదీప్ వర్మ, జగదీశ్ ఈశ్వరభాయ్ పటేల్, డాక్టర్ సందీప్ పాఠక్, ఫాంగ్నోన్ కొన్యక్, సంగీతా యాదవ్, అనిల్ ఆంటోనీ, ఎం.వెంకటేషన్, మనోజ్ తిగ్గా, సిద్ధార్థ్ శంబు, స్వదేశ్ సింగ్, మృగాంగ్ దేవ్ బర్మన్, రోహన్ గుప్తా, జై ప్రకాశ్.
జాతీయ కోశాధికాధిరి : పీయూష్ గోయల్.
సంయుక్త కోశాధికారి : రాజేశ్ మంగల్








