డొనాల్డ్ ట్రంప్ కు షాక్.. అమెకు రూ.692 కోట్లు చెల్లించాల్సిందే
అమెరికా అధ్యక్ష పీఠంపై రెండోసారి కూర్చోవాలని కలలు కంటున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నకు కోర్టు కేసుల్లో వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. అమెరికన్ మాజీ కాలమిస్ట్ జీన్ కరోల్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నూయ్యార్క్లోని మాన్హటన్ ఫెడరల్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ట్రంప్ ఆమెకు 83.3 మిలియన్ డాలర్లు ( భారత కరెన్సీలో దాదాపు రూ.692 కోట్లకు పైమాటే) చెల్లించాలని ఆదేశించింది. కొన్నేళ్ల క్రితం తనపై లైంగిక వేధింపులకు పాల్పడిన ట్రంప్ ఇప్పుడు తన పరువుకు భంగం కలిగించేలా వ్యాఖ్యలు చేశారంటూ కరోల్ ఇటీవల దావా వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు తాజాగా ట్రంప్నకు భారీ జరిమానా విధిస్తూ తీర్పునిచిచంది. ఆమెకు నష్టపరిహారం కింద 18.3 మిలియన్ డాలర్లతో పాటు భవిష్యత్తులో ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా ఉండేలా మరో 65 మిలియన్ డాలర్లు చెల్లించాలని న్యాయస్థానం ఆదేశించింది.






