Nara Lokesh: ఐవిపి సెమీ ఫౌండర్ రాజా మాణిక్కంతో మంత్రి లోకేష్ భేటీ
ఎపిలో సెమీ కండక్టర్స్ తయారీ యూనిట్ ఏర్పాటు చేయండి
సింగపూర్: ఐవిపి సెమి ఫౌండర్ రాజా మాణిక్కంతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) సింగపూర్ షాంగ్రీలా హోటల్ లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ… ఆంధ్రప్రదేశ్లో సెమీకండక్టర్ పరికరాల తయారీ కేంద్రం లేదా చిప్ డిజైన్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరారు. ఇందుకు రాష్ట్ర పారిశ్రామిక క్లస్టర్లలో అందిస్తున్న ప్రోత్సాహకాలను ఉపయోగించుకోవాలని అన్నారు. IVP సెమీ పర్యావరణ వ్యవస్థ-నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి పార్ట్ సరఫరాదారులుగా ఆంధ్రప్రదేశ్ MSMEలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో తమిళనాడుకు పొరుగున ఉన్న ఎపి ప్రాంతీయ సహకారాన్ని తీసుకోవాలని మంత్రి లోకేష్ సూచించారు. ఎపి ప్రభుత్వ ప్రతిపాదనలపై సహచర ఎగ్జిక్యూటివ్ లతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాజా మాణిక్కం తెలిపారు.
డిటిడిఎస్ సిఇఓ చక్రవర్తితో భేటీ
డిటిడిఎస్ గ్రూప్ సిఇఓ బిఎస్ చక్రవర్తితో మంత్రి నారా లోకేష్ భేటీ అయ్యారు. DTDS పర్యావరణ వ్యవస్థ నిర్మాణ నైపుణ్యాన్ని ఉపయోగించి పరికరాల తయారీకి ఆంధ్రప్రదేశ్ MSMEలకు సహకరించాలని విజ్ఞప్తిచేశారు. భారతదేశ సెమీకండక్టర్ పర్యావరణ వ్యవస్థలో ప్రాంతీయ సహకారాన్ని గుర్తించి తమిళనాడుతోపాటు ఎపి సేవలను వినియోగించుకోవాలని కోరారు.







