అమరావతి నిర్మాణంలో భాగస్వాములవుతాం
నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణానికి పూర్తి తోడ్పాటును అందిస్తామని జపాన్ మంత్రి యెకుషో టకాగి తెలిపారు. అమరావతి శంకుస్థాపన అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఆసియా- పసిఫిక్కు ఆంధ్రప్రదేశ్ గేట్వేలా ఉంటుందన్నారు. ఒక అద్బుత నగర నిర్మాణంలో పాలుపంచుకునే అవకాశం రావడం తమ అదృష్టంగా భావిస్తున్నామని తెలిపారు.






