పలువురికి ఆవార్డులిచ్చిన ‘తానా’
బాంక్వెట్ విందులో తానా వివిధరంగాల్లో విశేషసేవలందించినవారిని పురస్కారంతో సత్కరించింది. మాగంటి మురళీమోహన్ (సామాజిక సేవ), రోనీ ఆకురాతి (కళలు), రెబ్బా ధృవ్ (సైన్స్ అండ్ టెక్నాలజీ), ముత్యాల రామయ్య (సైన్స్ అండ్ టెక్నాలజీ), పొలినేని సుబ్బారావు, మండవ వెంకటేశ్వరరావు, తాళ్ళూరి శైల, పెరంబుదూర్ గిరిధర్ (సామాజిక సేవ), హరి కాంజీవరం (వైద్యం), మన్మథ్ రెబ్బా (క్రీడలు), ఆలపాటి తనూజ, బత్తుల నందిక (సామాజిక సేవ), బుర్రా హేమలత (విద్య), యలమంచిలి బసవేంద్ర (పెట్టుబడులు), శ్రీకాంత్ గడ్డం (పెట్టుబడులు), మణి పావులూరి (వైద్యం), సుసర్ల విజ్జా (సైన్స్), కేసీ చేకూరి (తెలుగు మీడియా), ఆకె రవికృష్ణ (పోలీస్), క్రిష్ జాగర్లమూడి (దర్శకుడు), లక్ష్మీ సలీం (ప్లాస్టిక్ సర్జన్), మువ్వా శ్రీనివాసరావు (సాహిత్యం), మాటూరి సంజన (సాహిత్యం), అయోధ్య కుమార్ (దర్శకత్వం), నాగూర్ ఐనగంటి (తానా సేవ), ఆకాష్, పూకోటి (భాషా శాస్త్రం) తదితరులు అవార్డులను అందుకున్నవారిలో ఉన్నారు.













