భారత్, అమెరికా మధ్య బలమైన సంబంధాలు

భారత్, అమెరికా మధ్య బలమైన సంబంధాలున్నాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. హవాయి ఓహూ ద్వీపంలోని అమెరికా భారత పసిఫిక్ కమాండ్, మిలిటరీ శిక్షణ కేంద్రాలను సందర్శించారు. భారత్, అమెరికా మధ్య బలమైన రక్షణ భాగస్వామ్యం పురోగతిపై రాజ్నాథ్ సింగ్ సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సైనిక సహకారం, ఐక్యత గురించి ప్రస్తావించారు. భారత్ అమెరికా ప్రజల ప్రయోజనాలకు అనుగుణంగా కలిసి పనిచేయాలని నిర్ణయించారు. అన్ని డొమైన్లలో భారత్`అమెరికా రక్షణ సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఇండో పసిఫిక్ కమాండ్ నాయకత్వంలో విష్తృత స్థాయి చర్చలు జరిపారు.