ఎమ్మెల్సీ కవితకు కరోనా పాజిటివ్

నిజామాబాద్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయ్యింది. గత మూడు రోజులుగా స్వల్ప దగ్గుతో బాధపడుతున్నారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు చేయించుకోగా, పాజిటివ్గా తేలింది. ప్రస్తుతం ఐసోలేషన్లో ఉన్నట్లు తెలిపారు. గత రెండు రోజుల వ్యవధిలో తనను కలిసిన వారంతా ముందు జాగ్రత్తగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని కవిత విజ్ఞప్తి చేశారు.