ఆమె తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణం : సీఎం చంద్రబాబు
ప్రముఖ నేపథ్య గాయని ఎస్.జానకి (S. Janaki) మరణంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు (Chandrababu ) తీవ్ర విచారణం వ్యక్తం చేశారు. ఉండవల్లి (Undavalli) క్యాంపు కార్యాలయంలో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. భారతీయ సంగీత రంగానికి ఆమె అందించిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. ఆమె తెలుగు నేలపై జన్మించడం మనందరికీ గర్వకారణమని కొనియాడారు. తన అపూర్వ గానంతో కోట్ల కొద్దీ సంగీతాభిమానుల హృదయాలను జానకి గెలుచుకున్నారని పేర్కొన్నారు. జానకి కుటుంబ సభ్యులు, అభిమానుల (Fans)కు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.








