ఏపీలో కరోనా విజృంభణ.. 24 గంటలో

ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడిచిన 24 గంటల వ్యవధిలో రాష్ట్ర వ్యాప్తంగా 86,035 మందికి పరీక్షలు నిర్వహించగా 14,792 కేసులు నిర్ధారణ అయ్యాయి. 57 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా కేసులతో కలిపి రాష్ట్రంలో 10,84,336 మంది వైరస్ బారినపడినట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 1,63,03,866 నమూనాలను ఆరోగ్య శాఖ పరీక్షించింది. 24 గంటల వ్యవధిలో 8,188 మంది బాధితులు కోలుకోవడంతో రాష్ట్రవ్యాప్తంగా కోలుకున్న వారి సంఖ్య 9,62,250కి చేరింది. 1,14,158 యాక్టివ్ కేసులున్నాయి. అత్యధికంగా చిత్తూరులో 1,831 కేసులు నమోదు కాగా, అత్యల్పంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 596 మంది వైరస్ బారినపడ్డారు. కొవిడ్తో అనంతపురం, విజయనగరం, పశ్చిమ గోదావరిలో ఏడుగురు, తూర్పు గోదావరిలో ఆరుగురు, చిత్తూరు, విశాఖలో ఐదుగురు, నెల్లూరు, శ్రీకాకుళంలో నలుగురు, కడప, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ముగ్గురు, కర్నూలులో ఇద్దరు, గుంటూరులో ఒక్కరు మృతి చెందారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా మృతుల సంఖ్య 7,928కి చేరింది.