జాన్సన్ అండ్ జాన్సన్ టీకా నిలిపివేత… ఎందుకో తెలుసా?

అమెరికాలో జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీకి చెందిన వ్యాక్సిన్ను ప్రజలకు ఇవ్వడాన్ని నిలిపివేయాలంటూ అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పష్టం చేసింది. వ్యాక్సిన్ తీసుకున్న వారిలో మెదడులో రక్తం గడ్డగట్టిపోతున్న లక్షణాలు బయటపడటంతో ఆ వ్యాక్సిన్ను నిలిపేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. మెదడు నుంచి రక్తాన్ని తీసుకొచ్చే నాళాల్లో రక్తం గడ్డకడుతోందని, అందులోనూ ప్లేట్లెట్లు తక్కువగా ఉంటున్నట్లు వైద్యులు గుర్తించారు. మొత్తం 60 లక్షల మందికి పైగా ప్రజలకు ఈ వ్యాక్సిన్ను ఇప్పటికే ఇవ్వగా, వారిలో 6 మందికి ఇలాంటి లక్షణాలు కనిపించాయి. యూరోపియన్ యూనియన్లో సైతం అస్ట్రాజెనెకా వ్యాక్సిన్తో ఇలాంటి లక్షణాలే కల్పించడంతో వాడకం నిలిపేసిన విషయం తెలిసిందే.