ఆగ్ర రాజ్యంలో కరోనా స్వైర విహారం
అగ్రరాజ్యం అమెరికాలో కరోనా మహమ్మారి విలయతాండవం చేస్తోంది. నిన్న మొన్నటి వరకు నగరాలు, పట్టణాల్లో ప్రభావం చూపిన ఈ ప్రాణాంతక వైరస్ ప్రస్తుతం అమెరికా గ్రామీణ ప్రాంతాల్లోనూ విరుచుకుపడుతోంది. 14 రాష్ట్రాల్లో కరోనా తీవ్రత అధికంగా ఉందని, గ్రామాల్లోనూ కరోనా విజృంభించడం ఆందోళన కలిగిస్తోందని వైట్ హౌస్ నిపుణులు పేర్కొన్నారు. ఇది కొత్త దశ అని, ఇప్పుడు నగరాలు, పల్లెలు అనే తేడా లేకుండా దేశం మొత్తం కరోనా వ్యాప్తి చెందుతోందని, ఇది అసాధారణ పరిణామం అని వెట్ హౌస్ టాస్క్ ఫోర్స్ సమన్వయకర్త డాక్టర్ డెబోరా బిర్కస్ సృష్టం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండేవారికి వైరస్ ముప్పు ఎక్కువ అని, ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడి చేసుకునే కార్యక్రమాలు కరోనా వ్యాప్తికి ప్రధాన కారణం అని వెల్లడించారు. ఇటువంటి కార్యక్రమాలు నిలిపివేయకపోతే అమెరికాలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడం అత్యంత క ష్టమని అభిప్రాయపడ్డారు.






