తెలంగాణలో 1,891 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో 53,086 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 1,891 మందికి పాజిటివ్గా తేలింది. ఇప్పటివరకు రాష్ట్రంలో 34,49,925 మందికి నిర్ధారణ పరీక్షలు చేయగా, 2,08,535 మంది కరోనా బారినపడ్డారని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ మేరకు ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్ శ్రీనివాసరావు శుక్రవారం ఉదయం కరోనా బులిటెన్ విడదుల చేశారు. అలాగే ఒక్క రోజులో 1,878 మంది కోలుకోగా, మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,80,953కి చేరుకుంది. కాగా ప్రస్తుతం కరోనా యాక్టివ్ కేసులు 26,374 ఉన్నాయి. శుక్రవారం ఏడుగురు చనిపోగా, ఇప్పటివరకు 1,208 మంది మరణించారు. రాష్ట్రంలో పది లక్షల జనాభాలో 92,690 మందికి నిర్ధారణ పరీక్షలు చేశారు.






