తెలంగాణలో 1,949 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో 51,623 మందికి పరీక్షలు నిర్వహించగా 1,949 మందికి కరోనా పాజిటివ్గా తేలినట్టు వైద్యారోగ్యశాఖ బులెటిన్లో పేర్కొంది. ఇప్పటి వరకు 32,05,249 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,99,276కి చేరింది. ఒక్క రోజులో 2,366 మంది ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కావడంతో మొత్తం కోలుకున్నవారి సంఖ్య 1,70,212 కి చేరింది. తాజాగా 10 మంది మృతితో మొత్తం మరణాలు 1,163కి చేరాయి. యాక్టివ్ కేసులు 27,901 ఉన్నాయి. రాష్ట్రంలో మిలియన్ జనాభాకు 86,116 మందికి పరీక్షలు నిర్వహిస్తున్నారు.






