ఏపీలో భారీగా తగ్గిన కరోనా కేసులు ..
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు భారీగా తగ్గాయి. ఒక్కరోజు వ్యవధిలో 61,112 నమూనాలను 3,224 మందికి కొవిడ్ నిర్ధారణ అయింది. నిన్నటితో పోలిస్తే సుమారు 2వేల కేసులు తగ్గాయి. తాజా కేసులతో రాష్ట్రంలో కరోనా సోకిన వారి సంఖ్య 7,58,951కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో కొవిడ్ చికిత్స పొందుతూ 31 మంది మృతి చెందారు. కృష్ణా, ప్రకాశం జిల్లాలో ఐదు మంది చొప్పున, గుంటూరు 4, కడప 4, అనంతపురం 3, తూర్పుగోదావరి 3, చిత్తూరు 2, పశ్చిమగోదావరి 2, కర్నూలు, నెల్లూరు, శ్రీకాకుళం, విశాఖపట్నం జిల్లాలో ఒక్కొక్కరు చొపున మరణించారు. దీంతో ఇప్పటివరకు కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 6,256కి చేరింది. 24 గంటల్లో 5,504 మంది కొవిడ్ నుంచి పూర్తిగా కోలుకోగా, ప్రస్తుతం రాష్ట్రంలో 43,983 యాక్టివ్ కేసులున్నాయి. ఇప్పటివరకు రాష్ట్ర వ్యాప్తంగా 66,30,728 నమూనాలను పరీక్షించారు.






