ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నట్టే కనిపించినా మళ్లీ పెరిగాయి. ఒక్కరోజు వ్యవధిలో 65,889 నమూనాలను పరీక్షించగా 5,795 మందికి కొవిడ్ సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనా సోకిన వారి సంఖ్య 7,29,307కి చేరింది. ఈ మేరకు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ బులెటిన్ విడుదల చేసింది. 24 గంటల వ్యవధిలో 33 మంది కరోనాతో చికిత్స పొందుతూ మృతి చెందారు. కృష్ణా జిల్లాలో 6 మంది, ప్రకాశం 5, తూర్పు గోదావరి 4, విశాఖపట్నం 4, అనంతపురం 3, చిత్తూరు 3, గుంటూరు, నెల్లూరు, పశ్చిమగోదావరిలో ఇద్దరేసి.. కడప, విజయనగరం జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. తాజా మరణాలతో రాష్ట్రంలో ఇప్పటి వరకు కొవిడ్తో మృతిచెందిన వారి సంఖ్య 6,052కి చేరింది. 24 గంటల్లో 6,046 మంది కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 62,16,240 నమూనాలను పరీక్షించినట్లు బులెటిన్లో పేర్కొన్నారు.






