తెలంగాణలో కొత్తగా 1,896 కరోనా కేసులు
తెలంగాణ రాష్ట్రంలో గడిచిన 24 గంటల్లో 50,367 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా 1,896 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,06,644కి చేరింది. ఈ మేరకు వైద్య ఆరోగ్యశాఖ బులిటెన్ విడుదల చేసింది. కరోనాతో 12 మంది మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1201కి చేరింది. కరోనా బారి నుంచి నిన్న 2,067 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కోలుకున్న బాధితుల సంఖ్య 1,79,075కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 26,368 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 21,724 మంది హోం ఐసోలేషన్లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 33,96,839కి చేరింది.






