రిపబ్లికన్ లకు వోటేయండి.. అమెరికన్ లకు మస్క్ పిలుపు
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో రిపబ్లికన్లకు ఓటు వేయాలని అక్కడి పౌరులకు ట్విట్టర్ అధినేత ఎలాన్ మస్క్ పిలుపు ఇచ్చారు. దీని వల్ల దేశంలో రెండు పార్టీల మధ్య అధికారం సమతుల్యంగా ఉంటుందని తెలిపారు. డెమోక్రాట్ లీడర్ లో బైడెన్ను ప్రెసిడెంట్ సీటులో కూర్చోబెట్టిన నేపథ్యంలో ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్లో రిపబ్లికన్లకు మెజారిటీ కల్పించాలని సూచించారు. అధికారం ఎప్పుడూ ఒక్కరి చేతుల్లోనే కేంద్రీకృతం కావడం మంచిది కాదని మస్క్ అభిప్రాయపడ్డారు. ఇదే విషయాన్ని మస్క్ ట్వీట్ చేశారు. అమెరికాలో పోలింగ్ జరుగుతోంది. ముందస్తు ఓటింగ్ విధానం ద్వారా ఇప్పటికే 4 కోట్ల మంది అమెరికన్లు వోటు వేశారు.
డెమోక్రాటిక్ పార్టీ అభిమానులు కానీ, రిపబ్లికన్ పార్టీ అభిమానులు కానీ తమ పార్టీని కాదని వేరే వాళ్లకు వోటు వేసే పరిస్థితి లేదని, ఈ పరిస్థితిలో ఏ పార్టీకి చెందని వోట్లు కీలకమని అన్నారు. ఆ వోట్లే పార్టీల జయాపజయాలను నిర్ణయిస్తాయని వివరించారు. అంటే అమెరికన్ కాంగ్రెస్లో ఏ పార్టీ మెజారిటీ సాధించాలో నిర్ణయించేది స్వతంత్రుల వోట్లేనని స్పష్టం చేశారు. అటువంటి ఏ పార్టీకి చెందిన వోటర్లు రిపబ్లికన్లకు వోటు వేయాలని మస్క్ కోరారు.






