స్పీచ్ డైరెక్టర్గా చొల్లేటి వినయ్రెడ్డి ఎంపిక
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ బృందంలో మన తెలుగోడికి అరుదైన స్థానం దక్కింది. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం పోతిరెడ్డిపేట గ్రామానికి చెందిన చొల్లేటి వినయ్రెడ్డి అమెరికా అధ్యక్షుడు బైడెన్ స్పీచ్ డైరెక్టర్ల బృందంలో ఒకరిగా నియమితులయ్యారు. వినయ్రెడ్డి తండ్రి నారాయణరెడ్డి వృత్తిరీత్యా డాక్టర్. 40 ఏండ్ల కింద అమెరికా వెళ్లి అక్కడే స్థిరపడ్డారు. వినయ్రెడ్డి అమెరికాలోనే విద్యాభ్యాసం పూర్తి చేశాడు. ఆంగ్లంపై మంచి పట్టు ఉండడంతో బైడెన్ స్పీచ్ డైరెక్టర్గా ఎంపికయ్యాడు. వినయ్రెడ్డి తండ్రికి పోతిరెడ్డిపేట గ్రామంలో ఇల్లు, వ్యవసాయ భూమి ఉంది. గ్రామానికి అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని గ్రామస్తులు తెలిపారు. వినయ్రెడ్డికి బైడెన్ బృందంలో చోటు దక్కినందుకు గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.






