జో బైడెన్ ఆర్థిక బృందంలో భారతీయుడు
అమెరికా ఆర్థిక విధానాల విషయంలో అధ్యక్షుడు జో బైడెన్కి సలహాలు ఇచ్చే ఆర్థిక బృందంలో భారతీయ మూలాలున్న అమెరికన్ భారత్ రామమూర్తి కీలక స్థానంలో నియమితులయ్యారు. భారత్ను నేషనల్ ఎకనమిక్ కౌన్సిల్ (ఎన్ఈసీ) డిప్యూటీ డైరెక్టర్గా మళ్లీ నియమిస్తున్నట్లు అమెరికా అధ్యక్ష భవనం వైట్హౌజ్ ప్రకటిచింది. వ్యూహాత్మక ఆర్థిక సంబంధాలకు సంబంధించి భారత్ బైడెన్కు సలహాదారుగానూ వ్యవహరిస్తారు. 2020 డిసెంబర్లో భారత్ ఎన్ఈసీలో ఆర్థిక సంస్కరణలు, వినియోగదారుల రక్షణ విభాగానికి డెప్యూటీ డైరెక్టర్గా పనిచేశారు.






