పొంగులేటికి కింగ్స్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్
తెలంగాణ శాసన పరిషత్ కాంగ్రెస్ పక్ష ఉపనేత పొంగులేటి సుధాకర్ రెడ్డికి అమెరికాలోని కింగ్స్ యూనివర్సిటీ నుండి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి, కాంగ్రెస్ పక్ష నేత షబ్బీర్ అలీ, చీఫ్ విప్ సుధాకర్ రెడ్డి, విప్ లు బి.వెంకటేశ్వర్లు, పల్లా రాజేశ్వర్రెడ్డి, కౌన్సిల్ సభ్యులు ఆయనను అభినందించి సన్నానించారు. ఈ అభినందన కార్యక్రమానికి శాసన సభ ప్రతిపక్ష నేత జానారెడ్డి, ఎమ్మెల్యే కోమటిరెడ్డి ప్రత్యేకంగా వచ్చి పొంగులేటికి అభినందనలు తెలిపారు.













