‘మరీచిక’ నుంచి ‘అందీ అందని అందం..’ సాంగ్ విడుదల.. మే 29న మూవీ గ్రాండ్ రిలీజ్
నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సతీష్ కాసెట్టి తన కొత్త థ్రిల్లర్ మూవీ ‘మరీచిక’తో మరోసారి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమయ్యారు. వైవిధ్యమైన , ఆలోచింపజేసే కథలను చూపడంలో ప్రత్యేక గుర్తింపు పొందిన డైరెక్టర్ మరోసారి తనదైన శైలిలో ఈసారి కూడా ఆసక్తికరమైన సినీ అనుభూతిని అందించినట్టు ట్రైలర్ చూస్తుంటే అనిపిస్తోంది.ఈ చిత్రంలో రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సినిమా మే 29న భారీ స్థాయిలో థియేటర్లలో భారీ ఎత్తున విడుదలకు సిద్ధమవుతోంది.
చిలక ప్రొడక్షన్స్ బ్యానర్పై రాజీవ్ చిలక, మేఘా చిలక ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ విడుదలై సూపర్బ్ రెస్పాన్స్ను రాబట్టుకుంది. మూవీపై అంచనాలు పెరిగాయి. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా నుంచి బుధవారం రోజున ‘అందీ అందని అందం’ అనే పాటను విడుదల చేశారు. విరాజ్ అశ్విన్, రెజీనా కసాండ్రా, అనుపమ పరమేశ్వరన్ మధ్య ఉండే అనుబంధాన్ని ఈ పాట తెలియజేస్తోంది.
‘అందీ అందని అందం’ అంటూ సాగే ఈ మధురమైన పాటను కార్తీక్, శ్వేతా మోహన్ ఆలపించారు. వీరి గాత్రం తెరపై కనిపించే భావోద్వేగాలకు మరింత గాఢతను తీసుకొచ్చింది. ప్రముఖ గేయ రచయిత లక్ష్మీ భూపాల ఈ పాటకు అర్థవంతమైన, హృదయాన్ని తాకేలా చక్కటి సాహిత్యాన్ని అందించారు.
లెజెండ్రీ మ్యూజిక్ డైరెక్టర్ మ్యాస్ట్రో ఇళయరాజా మరోసారి తన అద్భుతమైన సంగీత ప్రతిభను చూపించారు. ఆయన స్వరపరిచిన ఈ పాట ఎంతో కొత్తగా, మనసుకు హాయిగా అనిపిస్తూ మొదటిసారి విన్నప్పుడే ఆకట్టుకుంటోంది. అన్ని వయసుల వారినీ తాకే భావోద్వేగాలతో ఈ సాంగ్ను రూపొందించారు. పాట విన్న తర్వాత కూడా చాలా సేపు మనసులో మిగిలిపోయేలా ఉండే మాయ ఆయన సంగీతంలోనే సాధ్యమవుతుందని మరోసారి అనిపించింది.
ఈ పాటలో ముగ్గురు ప్రధాన పాత్రల మధ్య ఉన్న స్నేహం, ప్రేమ, భావోద్వేగ క్షణాలను ఎంతో అందంగా చూపించారు. హృదయాన్ని హత్తుకునే సంగీతం, భావపూరితమైన అనుభూతులతో ఈ పాట ప్రతి ఒక్కరి ప్లేలిస్ట్లో ప్రత్యేక స్థానం సంపాదించుకునేలా కనిపిస్తోంది.
మరీచిక సినిమాలో ఆకట్టుకునే విజువల్స్, కథనం, భావోద్వేగాలతో నిండిన నటన, ఉత్కంఠభరితమైన కథా ప్రయాణం ప్రేక్షకులను కట్టిపడేయనున్నాయి. కొత్తదనంతో కూడిన థ్రిల్ను తెలుగు ప్రేక్షకులకు అందించేందుకు ఈ సినిమా సిద్ధంగా ఉంది.







