తెలంగాణ ప్రజలకు సీఎం కేసీఆర్ ఉగాది శుభాకాంక్షలు
తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. శ్రీ హేవళంబి నామ సంవత్సరంలో ప్రజలు సుఖ, సంతోషాలతో జీవించాలని ముఖ్యమంత్రి ఆకాంక్షించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల ఫలాలు ప్రజలకు అంది రాష్ట్రం సుభిక్షం కావాలని కోరుకున్నారు.







