జనానికి చుక్కలు చూపించిన వైసీపీ శ్రేణులు
వైసీపీ అధినేత జగన్ (Jagan) కర్నూలు పర్యటనలో అడగడుగునా పోలీసులు ఆంక్షలను ఉల్లంఘించారు. అనుమతి లేకపోయినా బళ్లారి (Ballari) చౌరస్తాలో జాతీయ రహదారిపై డీజే పెట్టుకుని బైక్లతో స్టంట్స్ చేస్తూ జనానాకి చుక్కలు చూపించారు. ట్రాఫిక్ జామ్తో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కర్నూలు జిల్లా కారాగారంలో ఉన్న ఆలూరు వైసీపీ ఎమ్మెల్యే విరూపాక్షి (Virupakshi)ని పరామర్శించేందుకు జగన్ ఓర్వకల్లు విమానాశ్రయానికి చేరుకున్నారు. అనుమతులు లేకపోయినా అక్కడి నుంచి భారీ ర్యాలీతో కర్నూలు (Kurnool) బయల్దేరారు. దీంతో పలు వాహనాలు రాకపోకలు స్తంభించాయి. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు హెచ్చరించినా, వైసీపీ నాయకులు ఖాతరు చేయకుండా భారీ జనసమీకరణ చేసినట్టు సమాచారం.








