సీఎం స్టాలిన్ సంచలన నిర్ణయం

కరోనా కట్టడిలో పోలీసులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. వాళ్ల ప్రాణాలు పణంగా పెట్టి మరి కరోనా విధులు నిర్వర్తిస్తున్నారు. కరోనా విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన పోలీసుల విషయంలో తమిళనాడు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా సెకెండ్ వేవ్లో విధులు నిర్వర్తిస్తూ ప్రాణాలు కోల్పోయిన 36 మంది పోలీసులు కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థికసాయం ప్రకటిస్తూ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు కొవిడ్ డ్యూటీలు చేస్తూ పోలీసు ఉన్నతాధికారులతో సహా మొత్తం 84 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో తొలుత 13 మంది పోలీసుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించారు. తాజాగా ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు ఉన్నతాధికారులు సిఫార్సు మేరకు 36 మంది పోలీసుల కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని స్టాలిన్ ఉత్తర్వులు జారీ చేశారు. మిగతా 35 మంది పోలీసుల కుటుంబాలకు కూడా త్వరలో ఆర్థిక సాయం అందిస్తామని స్టాలిన్ తెలిపారు.