అంతర్జాతీయ ప్రయాణికులకు గుడ్ న్యూస్
ఇండియాకు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు భారత విమానయన సంస్థ గుడ్ న్యూస్ చెప్పింది. కొవిడ్ కారణంగా 2020 ఆగస్టులో భారతదేశం ఎయిర్ సువిధ పోర్టల్ను ప్రారంభించింది. 2021 నవంబర్ 30వ తేదీన కొన్ని కండిషన్స్, రూల్స్ని యాడ్ చేశారు. అప్పటి నుంచి నిబంధనలు కఠినతరం చేశారు. దీంతో విమాన ప్రయాణికులు బోర్డింగ్కు 72 గంటల ముందు ఆర్టీపీసీఆర్ పరీక్ష తప్పనిసరి చేసుకోవాల్సి ఉండేది. ఇక కొవిడ్ వ్యాక్సిన్ సర్టిఫికెట్ చూడా చూపించాల్సి ఉండేది. ఈ రూల్స్ని తొలగిస్తూ ఇప్పుడు ఆంక్షలను సడలించినట్లు అధికారులు తెలిపారు. దీంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఫారం నింపడాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.













