స్వరాష్ట్రంలో నిర్లక్ష్యం చేస్తున్నా… విదేశాల్లో పట్టం
స్వరాష్ట్రంలో తెలుగును నిర్లక్ష్యం చేస్తున్నా, విదేశాల్లో తెలుగు వారు తమ భాష, పాటను, సాంస్కృతి, సంప్రదాయాలు, కళలను పరిక్షించుకునే విషయంలో ముందున్నారని వ్యక్తలు పేర్కొన్నారు. యువకళా వాహిని, బాలానాద వినోదం (అమెరికా) ఆధ్వర్యంలో సారిపల్లి కొండలరావు ఫౌండేషన్ సౌజన్యంతో అమెరికాలోని బాలనాద వినోద మ్యూజిక్ అకాడమీ విద్యార్థులు గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంకు అంతర్జాల వేదికగా స్వర నీరాజనం సమర్పించారు. యువ కళా వాహిని అధ్యక్షుడు లంక లక్ష్మీ నారాయణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో హైకోర్టు పూర్వ న్యాయమూర్తి జస్టిస్ రామలింగేశ్వరరావు, సారిపల్లి కొండలరావు, సినీగేయ రచయిత సిరాశ్రీ తదితరులు పాల్గొన్నారు.













