రికార్డు స్థాయిలో కరోనా కేసులు..

భారత్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉధృతమవుతోంది. తాజాగా హెల్త్ బులిటెన్ను కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ విడుదల చేసింది. కొత్త కేసులతో పాటు, క్రియాశీల కేసులు, మరణాల సంఖ్యలోనూ ఆందోళన కలిగిస్తోంది. క్రితం రోజుతో పోలిస్తే రికార్డు స్థాయిలో కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో 10.65 లక్షల పరీక్షలు చేయగా 53,476 మందికి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయినట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 1,17,87,534కి చేరింది. కొత్తగా 26,490 మంది వైరస్ బారి నుంచి బయటపడ్డారు. దీంతో మ్తొతం రికవరీల సంఖ్య 1,12,31,650కు చేరి, రికవరీ రేటు 95.49 శాతానికి తగ్గింది. కరోనా మరణాలు అంతకుముందు రోజు 275 నమోదు కాగా, నేడు 251 మంది మరణించారు. దీంతో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1,60,692కి చేరింది. ఇక మరణాల రేటు 1.37 శాతానికి చేరింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా క్రియాశీల కేసుల సంఖ్య 3,95,192కి పెరిగిందని వైద్య ఆరోగ్యశాఖ వెల్లడించింది.