త్వరలోనే బహిరంగ మార్కెట్ లోకి టీకా

కరోనా టీకాలు కొవాగ్జిన్, కొవిషీల్డ్ టీకాల బహిరంగ మార్కెట్ ధరలు ఖరారైనట్టు తెలుస్తోంది. ఈ రెండు టీకాల ఒక్కో డోసు ధర రూ.275 వరకు ఉండొచ్చని సమాచారం. సర్వీసు చార్జీల రూపంలో మరో రూ.150 అదనంగా వసూలు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ఆసుపత్రులలో కొవాగ్జిన్ రూ.1200కు, కొవిషీల్డ్ రూ.780కి లభిస్తోంది. ఆసుపత్రులకు మాత్రమే పరిమితమైన ఈ టీకాలను బహిరంగ మార్కెట్ లోకి తీసుకొచ్చేందుకు ఈ రెండు సంస్థలు భారత ఔషధ నియంత్రణ సంస్థ డీసీజీఐకి దరఖాస్తు చేసుకున్నాయి. పరిశీలించిన కొవిడ్ 19 నిపుణుల కమిటీ షరతులతో కూడిన అనుమతులు ఇవ్వొచ్చని సిఫార్సు చేసింది. ఈ నేపథ్యంతో బహిరంగ మార్కెట్ లో ఒక్కో డోసు ధరను ఎంతకు విక్రయించాలన్న దానిపై నేషనల్ ఫార్మాస్యూటికల్ ప్రెసింగ్ అథారిటీ (ఎన్పీపీఏ) కసరత్తు ప్రారంభించింది.