ఆ విధానం వదిలేస్తే.. ఈసారి భారీ స్థాయిలో

కరోనా కట్టడి చేసేందుకు చైనా అవలంభిస్తున్న జీరో కొవిడ్ టోలరెన్స్ విధానాన్ని వదిలేస్తే, ఒక్కసారిగా అతి భారీ స్థాయిలో కేసులు విజృంభిస్తాయని తాజా అధ్యయనం హెచ్చరించింది. ఈ విధానాన్ని ఎత్తివేయడంతో పాటు, పలు దేశాల మాదిరిగా ప్రయాణాలపై నిషేధాన్ని కూడా తొలగిస్తే చైనాలో రోజు 6.30 లక్షల వరకు కొవిడ్ కేసులు బయటపడే ప్రమాదం ఉందని పెకింగ్ యూనివర్సిటీ చెందిన గణితశాస్త్ర నిపుణులు ఒక నివేదికలో పేర్కొనన్నారు. 2019లో ఆఖరులో కరోనా తొలి కేసు చైనాలోని వూహాన్లోనే బయటపడిన సంగతి తెలిసిందే.
కరోనా మహమ్మారిగా మారినప్పటి నుంచి చైనా ఒక్క కేసు కూడా రాకూడదన్న లక్ష్యంతో కట్టుదిట్టమైన విధానాన్ని అవలంబించింది. చైనాకు ఈ జీరో కొవిడ్ విధానం తప్ప మరో మార్గం లేదని తెలుస్తుంది. ఈ నేపథ్యంలో చైనా దీన్ని వదిలేసి అమెరికా ప్రస్తుతం అవలంభిస్తున్న విధానాన్ని పాటిస్తే రోజుకు 6,37,155 కేసులు బయటపడతాయని తాజా అధ్యయనం పేర్కొంది.