పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి కేఏ ప్రొడక్షన్స్ పై మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేసి హీరో కిరణ్ అబ్బవరం
వెర్సటైల్ స్టోరీస్, ఇన్నోవేటివ్ కాన్సెప్ట్స్ ను తెలుగు ప్రేక్షకులకు అందిస్తూ యంగ్ టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలనే లక్ష్యంతో హీరో కిరణ్ అబ్బవరం కేఏ ప్రొడక్షన్స్ బ్యానర్ స్థాపించారు. బ్యానర్ పై ఇటీవల తిమ్మరాజుపల్లి టీవీ సినిమాను నిర్మించి విజయాన్ని అందుకున్నారు. ఇప్పుడు పౌర్ణమి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ తో కలిసి మరో ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం సమర్పణలో అనూష్ గోరక్ డైరెక్ట్ చేస్తున్నారు. శివశంకర నాయుడు. వై. తో కలిసి కిరణ్ అబ్బవరం నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో కుష్లు, నమ్రిత.ఎంవీ, రెహమాన్, తనూజ పుట్టుస్వామి కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ సినిమా అనౌన్స్ మెంట్ సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో పక్షి కాళ్లను చూపిస్తూ, ‘ఇలాంటి కథను మీరు ఇప్పటిదాకా తెరపై చూడలేదు, ఇలాంటి జానర్ ను మీరు ఊహించలేదు..’అంటూ రాసిన క్యాప్షన్ ఆసక్తి కలిగిస్తోంది. ఒక కొత్త తరహా కథను స్క్రీన్ మీద ప్రెజెంట్ చేయబోతున్నారు అనే ఇంప్రెషన్ అనౌన్స్ మెంట్ పోస్టర్ తో అందరిలో కలుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.








