జో బైడెన్ టీంలో మరో భారతీయురాలికి చోటు
అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బైడెన్ మరో భారతీయురాలికి కీలక బాధ్యతలు అప్పగించారు. వైట్ హౌస్ ఆఫీస్ ఆఫ్ డిజిటల్ స్ట్రాటజీ భాగస్వామ్య మేనేజర్గా మరో భారతీయురాలిని నియమించారు. కశ్మీర్లో జన్మించిన ఈషా షాను ఈ పదవికి ఎంపిక చేశారు. డిజిటల్ స్ట్రాటజీ డైరెక్టర్ రాబ్ ప్లాహెర్టీ నేతృత్వం వహించనున్నట్లు బైడెన్ ట్రాన్సిషన్ బృందం ఒక ప్రకటనలో తెలిపింది. లూసియానాలో పెరిగిన షా గతంలో బైడెన్-హారిస్ ప్రచారంలో డిజిటల్ భాగస్వామ్య నిర్హాకురాలిగా పనిచేశారు. ప్రస్తుతం అమె స్మిత్సోనియన్ ఇన్స్టిట్యూషన్ అడ్వాన్స్మెంట్ స్పెషలిస్ట్గా విధులు నిర్వహిస్తున్నారు. అంతకుముందు జాన్ఎఫ్ కెన్నడీ సెంటర్ ఫర్ పెర్ఫార్మింగ్ ఆర్టస్ కార్పోరేట్ ఫండ్లో అసిస్టెంట్ మేనేజర్గాను, ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సంస్థ బ్యూరు కమ్యూనికేషన్ స్పెషలిస్ట్గానూ పనిచేశారు.






