ఈటల రాజేందర్ కు మరో షాక్..

మాజీ మంత్రి ఈటెల రాజేందర్ భూ కబ్జా వ్యవహారంలో కీలక మలుపు చేసుకుంది. ముఖ్యమంత్రి కేసీఆర్కు మరో ఫిర్యాదు అందింది. ఈటెల రాజేందర్ కుమారుడు నితిన్ రెడ్డి తన భూమి కబ్జా చేశారని, తనకు న్యాయం చేయాలని కోరుతూ, మేడ్చల్ జిల్లా మేడ్చల్ మండలం రావల్ కోల్ గ్రామ నివాసి పీట్ల మహేష్ ముదిరాజ్ అనే వ్యక్తి ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిర్యాదుతో కూడిన దరఖాస్తు చేశారు. దీంతో పాటు మాజీ మంత్రి ఈటల రాజేందర్ తనయుడు నితిన్ రెడ్డి తన భూమిని ఆక్రమించుకొన్నారని మహేష్ ముదిరాజ్ వీడియోను సోషల్ మీడియాలో ఓ వీడియోను పోస్టు చేశారు. తనకు న్యాయం చేయాలని కూడా ఆ వీడియోలో కోరాడు.
దీంతో తనకు అందిన ఫిర్యాదు మేరకు తక్షణమే దర్యాప్తు ప్రారంభించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ను ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ మేరు ఏసీబీ విజిలెన్స్ శాఖ, రెండు శాఖలు సమగ్ర దర్యాప్తు జరిపి ప్రభుత్వానికి నివేదిక అందజేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారు. ఇప్పటికే ఈటల భూకబ్జా వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన విషయం తెలిసిందే.