Minister Anam:చంద్రబాబు ఆ ప్రయత్నాలు చేస్తున్నారు:మంత్రి అనం
గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచన చేస్తున్నారని రాష్ట్ర మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Ramanarayana Reddy) తెలిపారు. నెల్లూరులో మంత్రి మీడియాతో మాట్లాడుతూ రూ.84వేల కోట్లతో ప్రణాళికలు రూపొందించినట్లు తెలిపారు. నదుల అనుసంధానానికి పొరుగు రాష్ట్రాల సమ్మతి అవసరమని, చంద్రబాబు(Chandrababu) ఆ ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. సముద్రంలోకి వృథాగా పోయే జలాలపైనా రాజకీయ ప్రయోజనాల కోసం కొందరు రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. గత ప్రభుత్వం రూ.400 కోట్లు ఖర్చు చేయలేక హంద్రీనీవా (Handreeniva) ప్రాజెక్టును పక్కన పడేసిందని, కూటమి ప్రభుత్వం దాన్ని పూర్తి చేసిందని చెప్పారు.
కేంద్ర ప్రభుత్వ సహకారంతో పోలవరం (Polavaram) పనులు పూర్తవుతున్నాయి. సోమశిలకి 18.750 క్యూసెక్కుల ఇనోఫ్లో వస్తోంది. ప్రస్తుతం సోమశిల, కండలేరు లో 150 టీఎంసీల నీటిని నిల్వ చేస్తాం. గత ప్రభుత్వం సోమశిల నుంచి కండలేరు ఫ్లడ్ ఛానల్ సామర్థ్యం 12 వేల క్యూసెక్యూల నుంచి 24 వేలకి పెంచుతామంది. మాజీ సీఎం జగన్ (Jagan) , మాజీ మంత్రి ఆలోచన లేకుండా కమీషన్ల కోసం టెండర్లు పిలిచారు. పనులు మధ్యలోనే ఆపేశారు. సోమశిల (Somasila) హైలెవల్ కెనాల్ కోసం అవసరమైన భూసేకరణకు సీఎం చంద్రబాబు నిధులిచ్చారు. జిల్లాలో 40 పంచాయతీ భవనాల నిర్మాణానికి ప్రభుత్వం రూ.12.8 కోట్ల నిధులు ఇచ్చారు. గ్రామాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు కేటాయించారు. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కి జిల్లా ప్రజల తరపున కృతజ్ఞతలు అని అన్నారు.







