విటమిన్ డి లోపంతో కరోనా ముప్పు అధికం
విటమిన్ డి లోపం ఉన్నవారికి కొవిడ్ ముప్పు ఎక్కువని తాజా అధ్యయనంలో వెల్లడైంది. రోగనిరోధక వ్యవస్థను శక్తిమంతం చేయడంతోపాటు, ఇన్ఫెక్షన్కు గురికాకుండా శ్వాస వ్యవస్థను కాపాడటంలో విలమిన్-డి ఇతోధికంగా దోహదపడుతున్నట్టు గత పరిశోధనల్లోనూ వెల్లడైంది. అయితే ,కొవిడ్-19ను ఎదుర్కోవడంలో దీని పాత్ర ఏమిటన్నది తెలుసుకునేందుకు యూనివర్సిటీ ఆఫ్ షికాగో మెడిసిన్ పరిశోధకులు తాజాగా ఓ అధ్యయనం చేపట్టారు. మహమ్మారికి ముందు, ఆ తర్వాత 489 మందికి సంబంధించిన ఆరోగ్య వివరాలను సేకరించారు. విటమిన్-డి స్థాయి తగినంతగా ఉన్నవారితో పోల్చితే.. ఈ లోపంతో బాధపడుతున్నవారే ఎక్కువగా కొవిడ్కు గురైనట్లు గుర్తించారు.






