దేశంలో తగ్గుముఖం పడుతున్న కరోనా…

దేశంలో కరోనా తీవ్రత తగ్గుతున్నది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 1,27,510 పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ తెలిపింది. కొత్తగా 2,55,287 మంది బాధితులు కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జి అయ్యారు. మరో 2,795 మంది వైరస్ బారినపడి మృతి చెందారు. దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,81,75,044కు చేరింది. ఇప్పటి వరకు కరోనా నుంచి 2,59,47,629 మంది బాధితులు కోలుకున్నారు. కరోనాతో మొత్తం 3,31,895 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 18,95,520 యాక్టివ్ కేసులు ఉన్నాయి. టీకా డ్రైవ్లో 21,60,46,638 డోసులు పంపిణీ చేసినట్లు తెలిపింది.