24 గంటల్లో 55,342 పాజిటివ్ కేసులు
ఇండియాలో కరోనా వైరస్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. రోజువారిగా నమోదు అవుతున్న సంఖ్య గణనీయంగా తగ్గుతున్నది. గత 24 గంటల్లో దేశంలో కొత్తగా 55,342 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో ఇండియాలో ఇప్పటి వరకు నమోదు అయిన పాజిటివ్ కేసుల సంఖ్య 71.75 లక్షలకు చేరుకున్నది. కేంద్ర ఆరోగ్య శాఖ వివరాల ప్రకారం గడిచిన రెండు నెలల్లో వైరస్ కేసుల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. సెప్టెంబర్లో వైరస్ కేసులు పెరిగిన తర్వాత.. 70 వేల కన్నా తక్కువ కేసులు వరసుగా నమోదు కావడం ఇదే ప్రథమం. గత 24 గంటల్లో వైరస్ వల్ల 706 మంది చనిపోయారు. 71,75,881 పాజిటివ్ కేసుల్లో ప్రస్తుతం 8,38,729 యాక్టివ్ కేసులు ఉన్నాయి. 62,27,296 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. దేశవ్యాప్తంగా వైరస్ వల్ల మరణించిన వారి సంఖ్య 1,09,856కి చేరినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొన్నది.






