ఏపీలో కరోనా ఉధృతి…
ఆంధప్రదేశ్ రాష్ట్రంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. వైరస్ వ్యాప్తి రాష్ట్రంలో తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతోంది. నిన్నటితో పోలిస్తే తాజాగా కేసులు పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 75,990 శాంపిల్స్ను పరీక్షించగా, 7293 మందికి పాజిటివ్గా నిర్ధారణ అయింది. రాష్ట్రంలో కొత్తగా మరో 57 మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 55,23,786 శాంపిల్స్ను పరీక్షించగా.. 6,68,751 మందికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. వీరిలో 5663 మంది మృత్యువాత పడగా, 5,97,294 మంది కోలుకొని డిశ్చార్జి అయ్యారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 65,794 క్రియాశీల కేసులు ఉన్నాయి. ఉభయ గోదావరి జిల్లాల్లో కరోనా మహమ్మారి విజృంభిస్తోంది. తాజాగా తూర్పుగోదావరి జిల్లాలో 1011 కేసులు నమోదు కాగా, పశ్చిమగోదావరి జిల్లాలో 922 పాజివిట్ కేసులు వచ్చాయి. అలాగే, చిత్తూరులో 975, ప్రకాశం 620, కడప 537, అనంతపురం 513 చొప్పున అత్యధికే కేసులు నమోదయ్యాయి. ప్రకాశం జిల్లాలో పది మంది మృత్యువాతపడగా.. చిత్తూరు, కడప జిల్లాల్లో ఎనిమిది చొప్పున, కృష్ణాలో ఆరుగురు, విశాఖలో ఐదుగురు, ఉభయ గోదావరి జిల్లాల్లో నలుగురు చొప్పున, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ముగ్గురేసి, అనంతపురం, శ్రీకాకుళంలో ఇద్దరు, కర్నూలు, విజయనగరం జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున ప్రాణాలు కోల్పోయారు.






