దేశంలో కరోనా ఉధృతి

దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,58,089 కేసులు నమోదయ్యాయి. కరోనాతో 385 మంది మృతి చెందారు. 1,58,750 మంది కరోనా నుంచి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. దేశంలో ప్రస్తుతం 16,54,361 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. కరోనా పాజిటివిటీ రేటు 19 శాతానికి పెరిగింది. ఇక ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8,209కి చేరింది. ఇప్పటి వరకు 157 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ వేయించుకున్నారు.