న్యూయార్క్ లో మార్మోగిన బోనాల జాతర
పెద్దసంఖ్యలో హాజరైన న్యూయార్క్ వాసులు
తెలంగాణ జానపదం వినిపించిన కవులు, కళాకారులు
ఉత్సవాల్లో పాల్గొన్న Nassau కౌంటీ ప్రతినిధులు
న్యూయార్క్ తెలంగాణ తెలుగు సంఘం (NYTTA) ఆధ్వర్యంలో బోనాల జాతర అత్యంత, అంహరంగ వైభవంగా జరిగింది. వెల్లువత్తిన పల్లె వాతావరణం, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విదేశీ గడ్డపై సజీవంగా ప్రతిబింబించేలా స్థానిక ఐసెన్ హోవర్ పార్క్ లో నిర్వహించిన ఈ వేడుకలు ప్రవాస తెలుగు కుటుంబాలను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ కార్యక్రమానికి నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల అధ్యక్షత వహించగా, కార్యవర్గమంతా ఉత్సాహంగా ఏర్పాట్లుచేసి విజయవంతం చేశారు. తెలంగాణ జానపద కళా వైభవాన్ని ప్రతిబింబించేలా ప్రముఖ కళాకారులు, కవులు, గాయకుడు రసమయి బాలకిషన్, సినీ గేయరచయిత కాసర్ల శ్యామ్, జానపద కళాకారుడు నల్లగొండ గద్దర్, రచయిత గాయకుడు మిట్టపల్లి సురేందర్, ప్రముఖ ఫోక్ సింగర్ సంధ్య యాట లు తమ అద్భుత ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు.

పోతురాజు వేషధారణలో ఆశోక్ చింతకుంట చేసిన విన్యాసాలు, పద్మ కోడెల చేతుల మీదుగా ఏర్పాటు చేసిన అమ్మవారి అలంకరణ, డెకొరేషన్, మహంకాళి గుడి, బోనాల తయారీ, ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, కార్యక్రమానికి మరింత ఉత్సాహాన్ని తీసుకొచ్చాయి.
వేడుకల్లో డాక్టర్ పైళ్ల మల్లారెడ్డి దంపతులు, నైటా కార్యవర్గ సభ్యులు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన పెద్ద సంఖ్యలో తెలుగు ఎన్ఆర్ఐ కుటుంబ సభ్యులు పాల్గొని బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో, సాంప్రదాయబద్ధంగా జరుపుకున్నారు.
ఈ సందర్భంగా నైటా అధ్యక్షుడు రవీందర్ కోడెల మాట్లాడుతూ, తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు చేరవేయడంతో పాటు విదేశాల్లో నివసిస్తున్న తెలుగు వారికి తమ మూలాలను గుర్తు చేసే వేదికగా నైటా నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రవాస భారతీయుల్లో ఐక్యత, అనుబంధం మరింత బలపడుతుందని పేర్కొన్నారు.
అమెరికా నేలపై తెలంగాణ ఆత్మను ప్రతిబింబించిన ఈ బోనాల సంబరాలు పాల్గొన్న ప్రతి ఒక్కరికీ చిరస్మరణీయ అనుభూతిని మిగిల్చాయి. హాజరైన వారందరూ పసందైన తెలంగాణ వంటకాలతో విందు ఆరగించటంతో పాటు, అద్భుతంగా నిర్వహించిన నైటా కార్యవర్గాన్ని అభినందించారు.
ఈ కార్యక్రమంలో వైస్ ప్రెసిడెంట్ హరిచరణ్ బొబ్బిలి, కార్యదర్శి మహేష్ దోమల, Treasurer Dr. సౌమ్య చిట్టారి, నైటా మిగత కార్యవర్గం, చైర్మన్ Dr. రాజేందర్ రెడ్డి జిన్నా, వైస్ చైర్మన్, లక్సమణ్ ఏనుగు, బోర్డు ఆఫ్ డైరెక్టర్లు, Advisory కమిటీ సభ్యులు, దాతలు, కామ్యూనిటీ పెద్దలు, కామ్యూనిటీ సభ్యులు కుటంబాలతో సహా హాజరై బోనాలు పండుగను విజయవంతం చేశారు.








