“రోమాంచకం” సినిమాను ఓవర్సీస్ రిలీజ్ చేస్తున్న నిర్వాణ సినిమాస్
-సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న మూవీ
బ్లాక్ బస్టర్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా సమర్పణలో భద్రకాళీ పిక్చర్స్ బ్యానర్ నిర్మిస్తున్న సినిమా “రోమాంచకం”. సుమంత్ ప్రభాస్, అనంతిక సనిల్ కుమార్ జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు వేణుగోపాల్ రెడ్డి రూపొందిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది.
“రోమాంచకం” సినిమాను ఓవర్సీస్ లో నిర్వాణ సినిమాస్ గ్రాండ్ రిలీజ్ చేయబోతోంది. గతంలో భద్రకాళీ పిక్చర్స్ నిర్మించిన అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలను నిర్వాణ సినిమాస్ ఓవర్సీస్ లో రిలీజ్ చేసింది. ఈ బాండింగ్ ను కంటిన్యూ చేస్తూ “రోమాంచకం” సినిమాను ఓవర్సీస్ లో రిలీజ్ చేయబోతోంది నిర్వాణ సినిమాస్. సెప్టెంబర్ 2న ఓవర్సీస్ ప్రీమియర్స్ ప్రారంభం కానున్నాయి.
ప్రమోషనల్ కంటెంట్ తో “రోమాంచకం” సినిమా ఇప్పటికే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన ‘రాధా రమణ..’ సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను ఆకట్టుకుంటోంది. “రోమాంచకం” సినిమా ప్రేమ, హాస్యం, ఉత్కంఠ కలగలిపిన ఇంట్రెస్టింగ్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా ప్రేక్షకుల్ని ఉర్రూతలూగించేందుకు తెరపైకి రాబోతోంది.








