భారత్ కు అమెరికా చట్టసభ సభ్యుల మద్దతు
ఖలిస్థాన్ మద్దతుదారులు శాన్ఫ్రాన్సిస్కోలోని భారత కాన్సులేట్ పై దాడి చేయడాన్ని అమెరికా చట్ట సభ సభ్యులు ఖండించారు. ఈ నేరానికి పాల్పడిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అమెరికాలో భారత రాయబారి తరుణ్జీత్ సింగ్ సంధూను బెదిరింపులతో దూషించడాన్ని కూడా వారు తప్పుపట్టారు. ఎవరినైనా దూషించడానికి, ఆస్తులకు నష్టం కలిగించడానికి వాక్స్వేచ్ఛ అనుమతించదని పేర్కొన్నారు. అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రోఖన్నా, కాంగ్రెషనల్ కాకస్ (భారత్) సహచైర్మన్ మైఖెల్ వాల్జ్ ఖలిస్థానీల దుశ్చర్యను ఖండిరచారు. మేము అమెరికన్ల వాక్స్వేచ్ఛ, భావవ్యక్తీకరణకు మద్దతు ఇస్తాం. కానీ అది హింస, ఆస్తుల విధ్వంసాన్ని అనుమతించదు. దౌత్య కార్యాలయాలపై దాడులు నేరం. వీటిని ఏమాత్రం సహించం. భారత కాన్సులేట్పై జరిగిన దాడికి సంబంధించి స్టేట్ డిపార్ట్మెంట్, లాఎన్ఫోర్స్మెంట్తో కలిసి విచారణ జరపాలి. దీంతోపాటు దోషులను చట్టం ముందు నిలబెట్టాలి అని పేర్కొన్నారు. భారత దౌత్యాధికారి సంధు పై బెదరింపులు వంటి చర్యలకు ప్రజాస్వామ్యంలో చోటు లేదన్నారు.






