డొనాల్డ్ ట్రంప్ మరో కీలక నిర్ణయం
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి దిగిపోయే ముందు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. తాజాగా సెహెజెన్ జోన్ పరిధిలోని 26 దేశాలకు రవాణాపరమైన ఆంక్షలు విధించారు. వాటిలో యూకే, ఐర్లాండ్, బ్రెజిల్ తదితర దేశాలు ఉన్నాయి. ఈ దేశాలకు అమెరికా నుంచి ప్రయాణాలను నిషేధించారు. ఆ దేశాలకు జనవరి 26వ తేదీ వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ట్రంప్ నిర్ణయం తీసుకున్నారు. ప్రపంచంలోనే అత్యధికంగా కరోనా కేసులు, మృతులు అమెరికాలోనే నమోదయ్యాయి. ఆ దేశంలో మొత్తం 2,41,10,867 కేసులు నమోదవగా, మృతులు 3,98,915 మంది ఉన్నారు. ఇంకా కరోనా తీవ్ర రూపంలో విజృంభిస్తోంది. అయితే కొత్త రకం వైరస్ బ్రిటన్, బ్రెజిల్లో వెలుగులోకి రావడంతో ఈ మేరకు ట్రంప్ ఆ దేశాల నుంచి ప్రయాణాలను నిషేధించారు.






